ముంబై: ఐపీఎల్-8లో సన్ రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి ఎదురైంది. శనివారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగులతో హైదరాబాద్పై విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ పూర్తి ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. ధావన్ (29 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 42) దూకుడుగా ఆడినా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. లోకేష్ 25, రవి బొపార 23, హనుమ విహారి 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మలింగ 4, మెక్లెనాగన్ 3 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో ఏడు మ్యాచ్ లాడిన ముంబైకిది రెండో విజయం కాగా ఆరు మ్యాచ్ లాడిన సన్ రైజర్స్ కు నాలుగో పరాజయం.
లక్ష్యసాధనను సన్ రైజర్స్ దీటుగా ఆరంభించింది. ఓపెనర్ ధావన్ దూకుడుగా ఆడటంతో 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. అయితే ఆ మరుసటి బంతికి మరో ఓపెనర్ వార్నర్ (9) అవుటవడంతో హైదరాబాద్కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఆ వెంటనే ధావన్ కూడా అదే బాటపట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ కోలుకోలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిపాలైంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ సిమన్స్ (42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. పొలార్డ్ 33, రోహిత్ శర్మ 24, పార్థివ్ పటేల్ 17 పరుగులు చేశారు. కాగా తెలుగుతేజం అంబటి రాయుడు 7 పరుగులకే వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ మూడు, స్టెయిన్, ప్రవీణ్ చెరో రెండు వికెట్లు తీశారు.
హైదరాబాద్ ఓటమి
Published Sat, Apr 25 2015 7:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement