ఆసీస్కు దీటుగా టీమిండియా బ్యాటింగ్ | Sakshi
Sakshi News home page

ఆసీస్కు దీటుగా టీమిండియా బ్యాటింగ్

Published Sun, Jan 31 2016 4:22 PM

ఆసీస్కు దీటుగా టీమిండియా బ్యాటింగ్

సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి ట్వంటీ 20 మ్యాచ్ లో 198 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా దీటుగా బదులిస్తోంది.  టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ మాత్రమే కోల్పోయి 102 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ(37 నాటౌట్), విరాట్ కోహ్లి(33 నాటౌట్)లు ఆసీస్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నారు.

 

అంతకుముందు  శిఖర్ ధావన్(26;9 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దాటిగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20.0ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

Advertisement
Advertisement