మిగతా విషయాలు మాట్లాడను: సింధు | Sakshi
Sakshi News home page

మిగతా విషయాలు మాట్లాడను: సింధు

Published Thu, Aug 25 2016 8:34 AM

మిగతా విషయాలు మాట్లాడను: సింధు - Sakshi

హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు విదేశీ కోచ్ తో శిక్షణ ఇప్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ చేసిన వ్యాఖ్యాలపై పుల్లెల గోపీచంద్ స్పందించాడు. డిప్యూటీ సీఎం కావాలని ఈ వ్యాఖ్యలు చేశారని తాను భావించడం లేదని చెప్పాడు. ఆయన మాట్లాడిన దాంట్లో సానుకూలాంశాలపై దృష్టి పెట్టనున్నట్టు తెలిపాడు.

తనకు గోపీచంద్ బెస్ట్ కోచ్ అని, మిగతా విషయాల గురించి మాట్లాడదలచుకోలేదని పీవీ సింధు పేర్కొంది. వచ్చే నెలలో జరగనున్న సూపర్ సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు తెలిపింది. ఈ సిరీస్ లో రాణిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో అగ్రశ్రేణి క్రీడాకారిని కరోలినా మారిన్ చాలా బాగా ఆడిందని, ఆ రోజు ఆమె పైచేయి సాధించిందని మెచ్చుకుంది.

Advertisement
Advertisement