‘సీట్ల కోసం చేతులు కట్టుకునే దద్దమ్మలు..’

KTR Fires On Congress In Mahabubabad Sabha - Sakshi

సాక్షి​, మహబూబాబాద్‌ : సీట్లకోసం చంద్రబాబు దగ్గరచేతులు కట్టుకునే దద్దమ్మలు పరిపాలన ఎలా చేస్తారంటూ కాంగ్రెస్‌ నేతలనుద్దేశించి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. మహబూబాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ... మహాకూటమి సీట్లను పంచుకునే లోపే మేము స్వీట్లు పంచకుంటామని, సోనియా గాంధీని అవినీతి అనకొండ అన్న టీడీపీతోతో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకుందని, సీట్లకోసం చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకునే దద్దమ్మలు ఎలా పరిపాలిస్తారంటూ కాంగ్రెస్‌ నేతలపై ధ్వజమెత్తారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ చొరవతో మహబూబాబాద్‌ జల్లా కేంద్రమైందని, డెబ్బై ఏళ్ల నుంచి పాలించిన ప్రభుత్వాలు తండాలను గ్రామపంచాయితీలుగా చేస్తామన్నాయి కానీ, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తండాలు గ్రామపంచాయితీలు అయ్యాయని గుర్తుచేశారు. గిరిజనుల రిజర్వేషన్ల ప్రక్రియ కేసీఆర్‌ ఇచ్చిన హామీని తప్పకుండా నేరవేరుస్తామన్నారు. అపార ఖనిజ సంపద ఉన్న బయ్యారం ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వ సహకరించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సహాకారంతో ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని హామి ఇచ్చారు. కేసముద్రంను మున్సిపాలిటీగా, ఇనుగుర్తిని మండల కేంద్రంగా చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్నరైతుకు పట్టాదారు పుస్తకాలు ఇస్తామని తెలిపారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్‌ను గద్దె దించాలని కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top