రాయ్పూర్/బార్గఢ్: దేశంలోని అందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఓ చట్టాన్ని తీసుకొచ్చే అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చెప్పారు. ప్రధాని మోదీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో 15–20 మంది వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన ‘అందరికీ ఆరోగ్యం’అనే జాతీయ సదస్సు ముగింపు సమావేశంలోæ మాట్లాడారు. ‘ఆరోగ్య భద్రతా చట్టంతో పాటు దేశంలోని అందరు వ్యక్తులకు ఆరోగ్య భద్రత హక్కును కల్పించాలనుకుంటున్నాం. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలనుకుంటున్నాం..’అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలకు కేటాయింపులు పెంచుతామన్నారు.
తప్పుడు వాగ్దానాలతో మోదీ మోసం
తప్పుడు వాగ్దానాలతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ముఖ్యంగా హామీల పేరుతో రైతులను మోదీ మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇప్పుడు ఏమైతే వాగ్దానాలు చేస్తుందో వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి చూపిస్తుందని చెప్పారు. ‘మేం ఏం చెప్తున్నామో వాటిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి వాగ్దానాన్ని ఆచరణలో చేసి చూపెడతాం. మోదీ లాగా కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేయదు...’అని పశ్చిమ ఒడిశాలో నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చి చూపించామన్నారు. ఈ రాష్ట్రాల్లోని రైతుల వ్యవసాయరుణాల్ని త్వరలోనే మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. వరికి కనీస మద్దతు ధర కింద క్వింటాల్కు రూ.2,500 ధరను ఛత్తీస్గఢ్లో పెంచినట్లు రాహుల్ వెల్లడించారు. ‘ఈ రాష్ట్రాల్లోని రైతులు ఒంటరి కాదని కాంగ్రెస్ మీతోనే ఉందనే భరోసానిచ్చాం. ఒడిశాలో కూడా అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటాం..’అని చెప్పారు.
సూసైడ్లకు అబద్దపు హామీలే కారణం
‘మోదీకి అబద్ధాలు చెప్పడం, తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేయడం అలవాటు. బీజేపీ మాటలు నమ్మి దేశవ్యాప్తంగా మోసపోయింది రైతాంగమే. మోదీ ప్రభుత్వం హామీలు నేరవేర్చకపోవడంతో దేశంలో రోజూ రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. అయినా వ్యవసాయ రుణాల మాఫీ, వరికి ఎంఎస్పీల గురించి పట్టించుకోదు. నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేయడంలో, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ దుయ్యబట్టారు.
అందరి ఆరోగ్యానికి చట్టం తెస్తాం
Published Sat, Mar 16 2019 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement