గోవాలో ఐదంతస్థుల భవనం కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 24కు చేరింది. సహాయక చర్యలు దాదాపు పూరైనాయి. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహల కార్యక్రమం దాదాపుగా పూర్తి అయిందని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారి అశోక్మీనన్ వెల్లడించారు.
శనివారం మధ్యాహ్నం ఐదంతస్థుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనకు సంబంధించి డిప్యూటీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాశ్ బందోర్కర్ను అరెస్ట్ చేశారు. అలాగే ఆ బిల్డింగ్ను నిర్మించిన భారత్ రియలేటర్స్ అండ్ డవలపర్స్కు చెందిన ముగ్గురు డైరెక్టర్స్తోపాటు మునిసిఫల్ ఇంజినీర్ అజయ్ దేశాయ్ల ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.