చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ బరిలో టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మండిపడ్డారు. మళ్లీ డబ్బులు పెట్టి కొనుగోలు చేసే ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సోమవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను కొనసాగించే క్రమంలో ఉన్నారన్నారు. కేసీఆర్కు తగిన బలం ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించారని, అలాగే చంద్రబాబూ పోటీపడి కొనుగోలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే దుర్బుద్ధి ఇదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ ప్రజలు ప్రతిపక్షమేనన్నారు. బహిరంగంగా ఫిరాయింపు నిరోధక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై కత్తి వేలాడుతోందని, మళ్లీ అదే తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఆయన బాగుపడేదిలేదన్నారు. రాజకీయ వ్యూహానికి, వ్యభిచారానికి తేడాఉందని, వ్యభిచారం అంటే బతుకు కోసం చేశామంటారన్నారు. వీళ్లూ అదేఅంటే మాకు అభ్యంతరమేమీలేదన్నారు. కేంద్రంలో ఉన్న వారూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నవారేనన్నారు. వెంకయ్యనాయుడికి ప్రత్యేక హోదా శనిలాగా అంటుకుందని, అందుకే దూరం గా రాజస్తాన్ వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టుగా వెంకయ్య ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకహోదా విడిచిపెట్టదంటూ జోస్యం చెప్పారు. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకోవడానికే మహానాడు వంటి సభలు తప్ప.. ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. 2050 వరకు అధికారంలో ఉండాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ 2019లో ముఖ్యమంత్రి అయితే చూద్దామని చెప్పారు. ప్రధాని మోదీ రెండేళ్ల పాలన ప్రజలకు శాపంగా, కార్పొరేట్ కంపెనీలకు వరంగా మారిందని నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గుడ్డిలో మెల్ల మేలన్న రీతిలో అస్సాంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో బీజేపీ గెలిచిందని ఎద్దేవా చేశారు.
కొనుగోళ్ల ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థి
Published Tue, May 31 2016 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
Advertisement