పాట్నాః బీహార్ బస్సు ప్రమాద ప్రాంతంలో సెల్ఫీ తీసుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భావనా ఝా చిక్కుల్లో పడింది. మధుబని ప్రాంతంలో బస్సు చెరువులో పడి 27 మంది వరకూ ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో ఆమె స్థానికులతో తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధుబని జిల్లాలోని బెనిపట్టి ఎమ్మెల్యే.. స్థానికులతో కలసి తీసుకున్న సెల్ఫీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ఆమె పీకకు చుట్టుకుంది. ఎమ్మెల్యే ఫోటోను బీజేపీ తీవ్రంగా తప్పు పడుతోంది. అదో అనైతిక చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 9న ప్రయాణీకులతో వెడుతున్న బస్సు బసైతా చౌక్ ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో పడిపోగా 27 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అటువంటి బీభత్సం జరిగిన ప్రాంతంలో ఎమ్యెల్యే ఫోటోలకు పోజులివ్వడం విచారకరమని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బినోద్ నారాయణ్ ఝా ఆరోపించారు. మానవ విషాదం జరిగిన సమయాన్ని కూడా ఎమ్మెల్యే పిక్నిక్ స్పాట్ లా ఫీలై రాజకీయానికి వాడుకుంటున్నారంటూ విమర్శించారు. మరోవైపు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ప్రేమ్ కుమార్.. బీహార్ ప్రజలకు భావనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే బీజేపీ రాజకీయ లబ్ధికోసమే వివాదం సృష్టిస్తోందని భావన అంటున్నారు. ప్రమాద ఘటనలో రెస్క్యూ నిర్వహిస్తున్న స్థానికులు.. తనతో ఫోటో దిగుతామని కోరారని భావనా ఝా చెప్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్విహించిన యువకులు సెల్ఫీ తీసుకుంటామన్నారని.. వారి కోరికను మన్నించి వారితో ఫోటో తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే పార్టీ సహచరుడు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి మదన్ మోహన్ ఝా ఆమెకు మద్దతునిచ్చారు. బస్సు ప్రమాదం తర్వాత ప్రజలకు గొప్ప సేవలను అందించిన భావనను ప్రశంసించాల్సింది పోయి... ఫోటోలను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 'సెల్ఫీ' చిక్కు...
Published Thu, Sep 22 2016 8:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement