మీతో ఆటలాడుతాం...మేం పాటా పాడుతాం, మీరూ మేము ఒకటే.. మధ్యలో మావోయిస్టు ఎవడురో, వాడి పీకుడేందిరో....అంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు తుపాకులు, తూటాలను పక్కన పడేసి గిరజన ప్రాంతాల్లో కాళ్లకు గజ్జెలు కట్టి ప్రజలతో పదం కలుపుతూ దరువులేస్తూ మరీ పాటలు పాడుతున్నారు. గిరిజనులతో మమేకమై వారిపై మావోయిస్టుల ప్రాబల్యాన్ని దెబ్బతీసేందుకు పోలీసులు అనుసరిస్తున్న సరికొత్త వ్యూహం ఇది. దీనికోసం సుక్మా జిల్లాలో ఇటీవలనే ‘పోలీస్ నాట్య చేతనా మంచ్’ అనే బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. పంట కోతల సమయంలో గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి స్థానిక భాషలోనే పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నారు.
ఛత్తీస్గఢ్ పోలీసులు సహజంగా అధికార భాషయిన హిందీలోనే మాట్లాడతారు. బడిలో విద్యాభ్యాసం కూడా హిందీలోనే ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలో అక్షరాస్యత చాలా చాలా తక్కువ. అక్కడి వారికి ఇప్పటికీ హిందీ పరాయి భాషే. వారితో మాటామాటా కలిపి కావాల్సిన సమాచారం సేకరించేందుకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సుక్మా జిల్లా అదనపు ఎస్పీ (నక్సల్స్ ఆపరేషన్స్) సంతోష్ సింగ్ స్థానిక భాషలైన గోండీ, హాల్బీ, ఛత్తీస్గఢీలను నేర్చుకోవాలని, ఆ భాషల్లోనే నక్సల్స్కు సంబంధించిన సమాచారాన్ని పోస్టర్ల రూపంలో ప్రకటించాలని రెండేళ్ల క్రితమే వ్యూహం పన్నారు. కొంతవరకు ఈ వ్యూహం ఫలించినా అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు. ఇక లాభం లేదని, వారి సాంస్కృతిక జీవనంలో భాగమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని పోలీసు అధికారులు భావించారు. అందులో భాగంగానే ఇప్పుడు పాటనే ఆయుధంగా చేసుకున్నారు. ప్రస్తుతం వారు పాడుతున్న పాటల భావమేమిటంటే....‘మీరు అభివృద్ధిలో ఇంతగా వెనుకబడి పోవడానికి మావోయిస్టులే కారణం. వారి కారణంగానే ప్రభుత్వ ప్రాజెక్టుల ఫలాలు మీకందడం లేదు. ఇక మావోయిస్టుల ఉద్యమానికి భవిష్యత్తు లేదు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికే ప్రభుత్వ పారితోషకాలు అందుకొని ఊరిబాట పట్టారు. మరెంతో మంది తమ పిల్లాపాపలతో అడవి బాట నుంచి పల్లెబాట పడుతున్నారు’....‘నీవు నేర్పిన పాటే నీరజాక్ష’ అంటూ మావోయిస్టులకు పోలీసులు కొత్త సవాల్ విసిరారు.
తూటా తుపాకి నై.. ఆటా పాటా సై
Published Thu, Mar 5 2015 6:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement