దిల్‌ రాజు పోస్ట్‌.. పెళ్లిపై క్లారిటీ..! | Sakshi
Sakshi News home page

దిల్‌ రాజు పోస్ట్‌.. పెళ్లిపై క్లారిటీ..!

Published Sun, May 10 2020 10:56 AM

Dil Raju Says His Starting A New Life - Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజ్‌ మరో పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటిపై ఆయన నుంచి ఎలాంటి స్పష్టత లేదు. తాజాగా తాను కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్టు దిల్‌ రాజ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా పలు కార్యకలాపాలు నిలిచిపోయాయి.. మనలో చాలా మంది కూడా వృత్తిపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగా కూడా నా జీవితం ఇప్పుడు అంతా గొప్పగా లేదు. కానీ త్వరలోనే ఈ పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాను. అన్ని బాగానే ఉంటాయి. ఈ ఆశతోనే నేను కొత్త జీవితం ప్రారంభించడానికి నాకు సమయం వచ్చిందని భావిస్తున్నాను. సంతోషకరంగా నేను నా వ్యక్తిగత జీవితాన్ని పున: ప్రారంభిస్తున్నాను’ దిల్‌ రాజు పేర్కొన్నారు. 

నిజామాబాద్‌లో దిల్‌ రాజు కుటుంబం నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి ఈ వివాహం జరగనున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరమే దిల్‌ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే నిజామాబాద్‌కు చేరుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం ఈ వివాహనాకికి 10 నుంచి 20 మంది కుటుంబసభ్యులు మాత్రమే హాజరుకాకున్నట్టుగా సమాచారం. అయితే దిల్‌ రాజు పెళ్లి చేసుకునేది ఎవరిననేది తెలియాల్సి ఉంది. కాగా, దిల్‌ రాజు సతీమణి అనిత 2017లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దిల్‌రాజ్ ఒంటరిగానే ఉంటున్నారు.‌ దిల్‌ రాజుకు ఏకైక కుమార్తె హన్షిత రెడ్డికి 2014లో అర్చిత్‌ రెడ్డితో వివాహం అయింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం హన్షిత తండ్రితో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement