హైదరాబాద్: సినీ కథనాయిక శృతి హాసన్ను వేధించడంలో భాగంగానే పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ సంస్థ వాస్తవాలను దాచి పిటిషన్లు దాఖలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆమె తరఫు న్యాయవాది బి.చంద్రసేన్రెడ్డి కోర్టుకు నివేదించారు. శృతీహాసన్పై పిక్చర్ హౌస్ మీడియా దాఖలు చేసిన పిటిషన్ను 25వ అదనపు చీఫ్ జడ్జి సాంబశివరావునాయుడు శుక్రవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా శృతీహాసన్ తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. వాస్తవానికి శృతీహాసన్ స్థానంలో తమన్నాతో ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్లోనే సినిమా షూటింగ్ నిర్వహిస్తూ... మరోవైపు తమ సినిమా పూర్తయ్యే వరకూ శృతీహాసన్ మరో సినిమాలో నటించకుండా ఈ కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు పొందారని నివేదించారు.
గత నెల 25న ఈ కోర్టును ఆశ్రయించక ముందే తమన్నాతో వారు ఒప్పందం చేసుకున్నారని... ఈ విషయాన్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం శృతీహాసన్కు పిక్చర్ హౌస్ మీడియా రూ.10 లక్షలు అడ్వాన్స్గా చెల్లించాలని, కాల్షీట్ల కోసం నెల రోజుల ముందే సంప్రదించాల్సి ఉందని తెలిపారు. అయితే, అడ్వాన్స్ చెల్లించకపోగా, ఏప్రిల్ 2 నుంచి షూటింగ్కు రావాలంటూ కొన్ని రోజుల ముందే కోరినట్టు వివరించారు. శృతీహాసన్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడంతో ఇదే విషయాన్ని మీడియా హౌస్ ప్రతినిధులకు తెలిపిందన్నారు.
నిబంధనలు పాటించకపోవడంతో వీరి మధ్య జరిగిన ఒప్పందమే చెల్లదని తెలిపారు. శృతీహాసన్ కొత్త సినిమాలతో ఒప్పందం చేసుకోరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని కోరారు. ఈ వ్యవహారంపై తమ వాదన వినిపించేందుకు గడువు కావాలని పిక్చర్ హౌస్ మీడియా తరఫు న్యాయవాది కోరవడంతో విచారణను కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తిలు కథానాయకులుగా, శృతీహాసన్ కథానాయికగా నటించేందుకు పిక్చర్ మీడియా హౌస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
'శృతిహాసన్ను వేధించేందుకే పిటిషన్లు'
Published Fri, Apr 17 2015 6:26 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement