జిస్మ్ 2, ఆయేషా వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు అరుణోదయ్ సింగ్ తన భార్య లీ ఎల్టన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ వార్తను వెల్లడించారు అరుణోదయ్. ‘ఇలాంటి ఒక విషాదకరమైన మెసేజ్ పోస్ట్ చేస్తానని అనుకోలేదు. నా వివాహ బంధం ముగిసిపోయింది. ప్రేమించుకున్నప్పుడు మేం చాలా సంతోషంగా ఉన్నాం. కానీ వివాహం తర్వాత కూడా అంతే ఆనందంగా ముందుకు సాగలేకపోయాం. అయితే మా బంధాన్ని నిలుపుకోవడానికి మేం అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. కౌన్సిలింగ్ తీసుకున్నాం.. కొన్ని రోజుల పాటు వేరుగా కూడా ఉన్నాం. కానీ అవేవీ మా బంధాన్ని పునరుద్ధరించలేకపోయాయి. దాంతో విడిపోవడమే తెలివైన పని అనిపించిది. మా ఇద్దరికి కూడా ఇదే మంచిది. దీన్ని మేము హుందాగా, గౌరవంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం’ అంటూ ఓ ఉద్వేగపూరిత సందేశాన్ని పోస్ట్ చేశారు అరుణోదయ్ సింగ్.
అరుణోదయ్ సింగ్, కెనడాకు చెందిన లీ ఎల్టన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎల్టన్కి గోవాలో ఓ రెస్టారెంట్ ఉంది. ఈ క్రమంలో గోవా వెళ్లిన అరుణోదయ్కి, ఎల్టన్కి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2016లో వీరిద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. భోపాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వీరి వివాహం.. రాయల్ వెడ్డింగ్ని తలపించింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈ జంట ఇంత త్వరగా విడాకులు తీసుకోబోతుండటం అటు వారి సన్నిహితులను.. ఇటు అభిమానులను కూడా తీవ్రంగా బాధ పెడుతుంది.