మార్కెట్ లోకి ఐఎస్ఐఎస్ ఉగ్ర నాణాలు! | Sakshi
Sakshi News home page

మార్కెట్ లోకి ఐఎస్ఐఎస్ ఉగ్ర నాణాలు!

Published Mon, Aug 31 2015 10:46 AM

మార్కెట్ లోకి ఐఎస్ఐఎస్ ఉగ్ర నాణాలు!

అగ్రరాజ్యాలు పెట్టుబడులతో ప్రపంచ దేశాలను బానిసలుగా మార్చే వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సొంతంగా  కరెన్సీ నాణేలను మార్కెట్ లోకి తెస్తోంది. బంగారు దినార్, వెండి దిర్హామ్, ఇత్తడి నాణేలను ముద్రిస్తోంది. 4.25 గ్రాముల బరువైన బంగారు దినార్ కు ఒకవైపు మొక్కజొన్న పంట, మరోవైపు ప్రపంచ పటం ముద్రించారు. ఒక బంగారు దినార్ విలువ 139 డాలర్లు అని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఐఎస్ఐఎస్ వెల్లడించింది. అయితే, తన సంస్థలోని ఉగ్రవాదులకు మాత్రం వారి అవసరాల కోసం డాలర్లనే ఇస్తుండడం కొసమెరుపు.

Advertisement
Advertisement