ఏపీ జెన్కో ఎండీ విజయానంద్
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం స్టేజ్-2, ఎన్టీటీపీఎస్ స్టేజ్-5 థర్మల్ ప్రాజెక్టుల బీవోపీ కాంట్రాక్టుల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ వివరణ ఇచ్చారు. ఇంత వరకూ టెండర్లను ఖరారు చేయలేదని, ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సాక్షిలో వచ్చిన ‘జెన్కో థర్మల్ ప్రాజెక్టుల్లో 2,880 కోట్ల రూపాయలు’ అనే వార్తపై ఆయన స్పందించారు. కాంట్రాక్టుల ధరలను ప్రముఖ కన్సల్టెన్సీలు పరిశీలించాయని, బిడ్డర్లతో జరిగిన చర్చల్లోనూ వారు పాల్గొన్నారని ఆయన తెలిపారు. బీజీఆర్, టాటా సంస్థలు ఎల్-1గా నిలిచినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో బీవోపీ కాంట్రాక్టుల్లో ధరలను పరిశీలిస్తున్నామని, దీనికోసం మరో కన్సల్టెన్సీకి కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
కొరత కారణంగా కొన్నాం: ట్రాన్స్కో డెరైక్టర్
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని, ఈ కారణంగానే విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని ట్రాన్స్కో డెరైక్టర్ దినేష్ పరుచూరి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు. అయితే, స్వల్పకాలిక కొనుగోళ్ళను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఇక సోలార్ టెండర్లలో రూ. 755 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై సోలార్ కార్పొరేషన్ ఎండీ ఆదిశేషు వివరణ ఇస్తూ.. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సోలార్ ఇపీసీ కాంట్రాక్టులు మెగావాట్కు రూ. 5.6 కోట్లకు ఇచ్చినా, అక్కడ ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ 18 శాతమేనని, ఏపీ జెన్కో మాత్రం 21 శాతం పీఎల్ఎఫ్ గ్యారంటీ కోరిందని వివరించారు. అదే మాదిరి పీఎల్ఎఫ్తో పోలిస్తే, జెన్కో కాంట్రాక్టులు మెగావాట్కు రూ. 5.36 కోట్లకే వచ్చినట్టన్నారు. విదేశీ బొగ్గు మింగేశారు... అంటూ వచ్చిన వార్త కథనంపై జెన్కో సీఈ కృపాసాగర్ మాట్లాడుతూ.. 2014లో మహానది కోల్ ఫీల్డ్స్ బొగ్గు సరఫరా కేవలం 67 శాతమే ఉందని, దీంతో థర్మల్ ప్రాజెక్టులకు బొగ్గు కొరత ఏర్పడిందని, ఈ కారణంగానే కాంట్రాక్టు ముగిసినా, ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ నుంచి బొగ్గు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావులేదని వెల్లడించారు.
జెన్కో ప్రాజెక్టుల్లో అవినీతి లేదు
Published Sat, Mar 12 2016 3:17 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement