గ్రేటర్ ఎన్నికల పరిశీలకులుగా 24 మంది ఐఏఎస్లు | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ఎన్నికల పరిశీలకులుగా 24 మంది ఐఏఎస్లు

Published Wed, Dec 23 2015 7:11 PM

election commission appointed 24 IAS for Greater hyderabad elections

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు సాధార‌ణ ప‌రిశీల‌కులుగా 24మంది ఐఏఎస్ అధికారుల‌ను నియ‌మిస్తూ రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఆ అధికారులకు వార్డుల కేటాయింపును కూడా పూర్తి చేసింది.

వీరితో పాటు ఎన్నిక‌ల వ్యయ ప‌రిశీల‌కులుగా మ‌రో 24మంది ఆర్థిక, ఆడిట్ విభాగాల‌కు చెందిన సీనియ‌ర్ అధికారుల‌ను ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. మ‌రో ఐదుగురు ఐఏఎస్ అధికారుల‌ను రిజ‌ర్వులో ఉంచుతున్నట్లు ఎన్నిక‌ల సంఘం తెలిపింది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు నియ‌మితులైన అధికారులంద‌రూ రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం ప‌రిధిలో డిప్యూటేష‌న్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఈ అధికారులతో ఈ నెల 28న రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్రత్యేకంగా స‌మావేశం కానున్నారు.

 

Advertisement
Advertisement