గుట్టల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం | Sakshi
Sakshi News home page

గుట్టల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

Published Mon, Aug 10 2015 9:10 AM

Woman dead body found in raghavapuram

నల్లగొండ : నల్లగొండ జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం రాఘవాపురం గుట్టల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. దాంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది... దీంతో సదరు మహిళను హత్య చేసి కనీసం మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ఒంటిపై ఎరుపు రంగు పంజాబీ డ్రెస్ ఉందని పోలీసులు తెలిపారు. అలాగే మృతురాలికి  28 ఏళ్ల వయస్సు ఉంటాయని వెల్లడించారు. మృతురాలి వద్ద పడి ఉన్న పర్స్లో హైదరాబాద్ నగరంలోని సీటి బస్సుకు చెందిన టికెట్ ఉందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Advertisement
Advertisement