తండ్రిని చంపిన కేసులో తనయుడు అరెస్టు | Sakshi
Sakshi News home page

తండ్రిని చంపిన కేసులో తనయుడు అరెస్టు

Published Wed, Feb 8 2017 12:38 AM

son arrest in father murder case

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): షరీఫ్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ సలాం మియ్యా హత్య కేసులో నిందితుడైన కొడుకు షేక్‌ చిన్న హుస్సేన్‌ను మంగళవారం ఉదయం 10.30 గంటలకు పోలీసులు కృష్ణానగర్‌ ఐటీసీ కంపెనీ దగ్గర అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం తల్లిని తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని నిందితుడు చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న నాలుగో టౌన్‌ పోలీసులు విచారణను వేగవంతం చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 
 

Advertisement
Advertisement