విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

Published Sat, Jul 23 2016 8:07 PM

RTC driver died under duty

కేతేపల్లి:
మండలకేంద్రానికి చెందిన ఆర్టీసీడ్రైవర్‌ విధి నిర్వహణలో మృతిచెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేతేపల్లికి చెందిన గుద్దింటి పెద మర్రయ్య(55) సూర్యాపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా మర్రయ్య శుక్రవారం శ్రీశైలం నైట్‌హాల్ట్‌ సర్వీసుపై డ్యూటీకి వెళ్లాడు. బస్సు శ్రీశైలం చేరుకుని రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించే క్రమంలో మర్రయ్యకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా మారింది. దీంతో∙మర్రయ్యను తోటి ఆర్టీసీ సిబ్బంది స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ  వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మర్రయ్య లోబీపీకి లోనై మృతిచెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు శ్రీశైలం వెళ్లి మర్రయ్య మృతదేహాన్ని శనివారం కేతేపల్లికి తీసుకవచ్చారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే మర్రయ్య హఠాన్మణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement