రుణం ఇప్పిస్తానని టోకరా | Sakshi
Sakshi News home page

రుణం ఇప్పిస్తానని టోకరా

Published Mon, Jun 20 2016 9:48 AM

man cheating in west godavari district over giving loan

ఏలూరు: పొలంపై రూ.3కోట్ల రుణం ఇప్పిస్తానని ఓ వ్యక్తి వద్ద  రూ.20వేలు వసూలు చేసి ఆనక ఉడాయించిన ప్రబుద్ధుల ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన వెలగపూడి వెంకటసుబ్బారావు భార్య పేరున అడవినెక్కలం వద్ద 5.63 ఎకరాల భూమి ఉంది. వేంపాడులో ఉంటున్న  ఎం.శ్రీనివాస్  ఎన్.రాజేంద్ర శ్యాంబాబు తమ అగ్రి కంపెనీ ద్వారా ఆ భూమిపై రూ.3కోట్ల రుణం ఇప్పిస్తామని, ఆ మొత్తం కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని చెప్పారు.

దీంతో  వెంకట సుబ్బారావు వారికి రూ.20వేల 500లు ఇచ్చారు. ఎంత నిరీక్షించినా.. బ్యాంకులో డబ్బులు జమకాక పోవడంతో సుబ్బారావు వేంపాడు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ సత్యన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement