ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం.. | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం..

Published Thu, Jul 28 2016 12:21 AM

ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం..

డబ్బులతో పరారైన మాయలేడీ..
లబోదిబోమంటున్న బాధితులు  
 
పార్వతీపురం : పట్టణంలోని బైపాస్‌ కాలనీ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగహంలో కమాటీగా పనిచేస్తున్న ఓ మహిళ పలువురికి ఉద్యోగాలు కల్పిస్తానంటూ డబ్బులతో ఉడాయించింది. విషయం తెలుసుకున్న కురుపాం మండలం సీతంపేటకు చెందిన మర్రాపు గౌరమ్మ, పైడమ్మ, తెంటు సుజాత , వెలగాడ ఉమ, తెంటు లక్ష్మి, తదితరులు లబోదిబోమంటున్నారు. బాధితులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలుర వసతిగహంలో కమాటీగా పనిచేస్తున్న బొత్స దమయంతి ఈ ఏడాది మార్చిలో సీతంపేట వెళ్లి పలువురు మహిళలను కలిసి పరిచయం చేసుకుంది. కమాటీగా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు తీసుకుంది. అయితే ఎప్పటికీ ఉద్యోగాల గురించి మాట్లాడకపోవడంతో బాధితులు డబ్బులు ఇమ్మని డిమాండ్‌ చేయడంతో బుధవారం ఇంటికి రమ్మని చెప్పింది. ఇంట్లో ఉండండి.. డబ్బులు తీసుకువస్తానని చెప్పి మాయలేడి పరారైంది. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   

Advertisement
Advertisement