కదిరి అర్బన్ : మండలంలోని మరువతండాలో గత నెల 31న జరిగిన ఓ వ్యక్తి హత్యకేసులో నిందితుడు వెంకటరమణానాయక్ను రూరల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. రామూనాయక్, వెంకటరమణనాయక్కు గతంలో ఆస్తి, రస్తా తగాదాలు ఉండేవి. ఈ క్రమంలో గత నెల 31న ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రామూనాయక్ ఎదపై వెంకటరమణానాయక్ గట్టిగా తన్ని, కట్టెతో దాడి చేశాడు. దీంతో అతడు తెల్లవారుజామున చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం అతడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు.