నా భర్త హత్యకు టీడీపీ నేతే కారణం.. | Sakshi
Sakshi News home page

నా భర్త హత్యకు టీడీపీ నేతే కారణం..

Published Wed, Dec 6 2017 2:22 PM

Person Brutal murdered in machavaram - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలో రౌడీషీటర్ కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్ వేమూరి సుబ్బు దారుణహత్యకు గురయ్యాడు. వేట కత్తులతో వచ్చిన ప్రత్యర్ధులు అతడిని బుధవారం కిరాతకంగా నరికి చంపారు.  ఇటీవల ఓ వ్యక్తి నుంచి తుపాకీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణపై పోలీసులు సుబ్బును అరెస్ట్ చేశారు. కాగా సుబ్బు... రౌడీషీటర్‌ శంతన్‌ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శిక్ష అనుభవిస్తున్న సుబ్రమణ్యం ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు.

అయితే పాతకక్షల నేపథ్యంలోనే సుబ్బు హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  సుబ్బు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేతో సుబ్బుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాగా తన భర్త హత్యకు టీడీపీ నేతే కారణమని మృతుడి భార్య ఆరోపించారు. హత్య ఘటనపై డీసీపీ గజరాజ్‌ భూపాల్‌ మాట్లాడుతూ.. హత్యకు వర్గ పోరే కారణమని, ఈ కేసులో దోషులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని  పేర్కొన్నారు.

Advertisement
Advertisement