ప్రేమజంట ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Published Sat, Jun 30 2018 8:03 AM

Love Couple Commits Suicide In Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: కృష్ణగిరి సమీపంలో గురువారం ప్రేమజంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణగిరి జిల్లా మహారాజకడై సమీపంలోని మాదినాయన్‌పల్లి ఇంద్రానగర్‌కు చెందిన వెంకటేష్‌. ఇతని కుమారుడు అశోక్‌ (19). అదే ప్రాంతానికి చెందిన లక్ష్మణన్‌ కుమార్తె మాదేవి (19). అశోక్‌ ఓసూర్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. మాదేవి తిరుప్పూర్‌లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది. ఒకే గ్రామంలో నివసిస్తున్న అశోక్, మాదేవికి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

విషయం వారి తల్లిదండ్రులకు, స్థానికులకు తెలిసింది. ఈ స్థితిలో అశోక్, మాదేవి తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరని భావించారు. దీంతో బుధవారం రాత్రి మాదినాయనప   ల్లిలోని ఇంటి ముందు అశోక్, మాదేవి విషం తాగి స్ఫృహ తప్పి పడిఉన్నారు. ఇద్దరిని కుటుంబీకులు, బంధువులు చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం అశోక్, మాదేవి మృతిచెందారు. మహరాజకడై సీఐ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement