ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

Published Wed, May 23 2018 9:26 AM

Stockmarkets  Opens in Flat  Note - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌ 15 పాయింట్లు నష్టపోయి 34635 వద్ద,నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి 10522వద్దకొనసాగుతున్నాయి.  అయితే లాభనష్టాల మధ్య ఒడిదుడుకులు తప్పవని అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ ఎనలిస్టులు సూచిస్తున్నారు. ఫార్మా నష్టపోతోంది. ఐటీ  షేర్లు  లాభపడుతున్నాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ బాగా లాభపడుతోంది. టాటా మోటార్స్‌,  టీసీఎస్‌ సహా  సిప్లా, అశోక్‌ లేలాండ్‌ లాభపడుతుండగా,  వేదాంతా,  ఐషర్‌ మోటార్స్‌ తదితర షేర్లు నష్టపోతున్నాయి.

అటు  కరెన్సీ మార్కెట్‌లో రూపాయి 0.09 పైసల లాభంతో ప్రారంభమైంది. డాలరుమారకంలో  మరోసారి 68 రూపాయల  దిగువకు చేరి 68.21వద్ద కొనసాగుతోంది.

Advertisement
Advertisement