రూపాయి పతనానికి, ముడి చమురు ధరలు భగ్గుమనడం కూడా జత కావడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆగస్టు నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులకు ముగింపు రోజు కూడా కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో ఎక్కువ మంది ట్రేడర్లు లాంగ్ పొజిషన్లను రోల్ఓవర్ చేయకుండా ఆఫ్లోడ్ చేయడం వల్ల స్టాక్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే చివరి గంటలో రికవరీ కారణంగా నష్టాలు తగ్గాయి. అయినప్పటికీ, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువనే ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 38,690 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 15 పాయింట్ల పతనంతో 11,677 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్ఎమ్సీజీ, లోహ, ఫార్మా, ఐటీ, పెరగ్గా, వాహన, ఆర్థిక, ఇంధన షేర్లు కుదేలయ్యాయి. ఆగస్టు సిరీస్లో నిఫ్టీ 5 శాతం, సెన్సెక్స్ 7 శాతం చొప్పున ఎగిశాయి.
నేడు జీడీపీ గణాంకాలు....
డాలర్తో రూపాయి మారకం ఇంట్రాడేలో జీవిత కాల కనిష్ట స్థాయి, 70.90కు పడిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 77 డాలర్లకు పెరిగాయి. అమెరికా చమురు నిల్వలు పడిపోవడం, ఇరాన్, వెనుజులా దేశాల నుంచి చమురు సరఫరాల్లో అవాంతరాలు ఏర్పడతాయనే అంచనాల కారణంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ ఏడాది జూన్ క్వార్టర్ జీడీపీ గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనున్నది. మార్కెట్ భవిష్యత్తు ట్రెండ్ను నిర్ధారించే అంశాల్లో ఈ గణాంకాలు కూడా ఒకటి అని నిపుణులంటున్నారు.
237 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్
సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప లాభాలతో ఆరంభమైనా, అమ్మకాల జోరుతో వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. చివర్లో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 96 పాయింట్లు లాభపడగా, మరో దశలో 141 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ రోజంతా 237 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 52 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇక ఆసియా మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయి, మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి.
►రూపాయి పతనం కారణంగా ఆదాయం పెరుగుతుందనే అంచనాలతో సన్ ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఈ షేర్ 3 శాతం లాభంతో రూ. 640వద్ద ముగిసింది. సన్ ఫార్మా షేర్కు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, క్రెడిట్ సూసీ అవుట్ ఫెర్ఫామ్ రేటింగ్ను కొనసాగిస్తూ, టార్గెట్ ధరను రూ.705కు పెంచడం కూడా సానుకూల ప్రభావం చూపించింది.
►ఐటీసీ 2% లాభంతో రూ.320కు ఎగసింది. ఇది ఈ షేర్కు తాజా ఏడాది గరిష్ట స్థాయి. ఈ షేర్ త్వరలో రూ.360ను చేరుతుందని, ఈ ధరలో కొనుగోలు చేయవచ్చని బీఓఏ–ఎంఎల్ సిఫార్సు.
►రిలయన్స్ ఎనర్జీ విక్రయం పూర్తవ్వడంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ 5.5 శాతం లాభపడి రూ.463 వద్ద ముగిసింది.
►విలీన బ్యాంక్ల జాబితా తయారు చేయాలని ఆర్బీఐని ప్రభుత్వం ఆదేశించిందన్న వార్తల కారణంగా కొన్ని ప్రభుత్వ రంగ షేర్లు 10 శాతం వరకూ పెరిగాయి. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్లు 1–4% రేంజ్లో పెరిగాయి.
►ముడిచమురు ధరలు పెరగడంతో విమానయాన రంగం షేర్లు నష్టపోయాయి. ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్ 3 నుంచి 5 శాతం రేంజ్లో పతనమయ్యాయి.
►ఇండస్ఇండ్ బ్యాంక్ 1.6 శాతం నష్టంతో రూ.1,876 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
రూపీ పతనంతో నష్టాలు
Published Fri, Aug 31 2018 12:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement