స్టాక్ మార్కెట్లో లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. కొనుగోళ్ల జోరుతో స్టాక్సూచీలు వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,400 పాయింట్లపైకి ఎగబాకాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువలా వస్తుండటం, రూపాయి బలపడుతుండటం, సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు... ఇవన్నీ స్టాక్ మార్కెట్ను లాభాల బాట నడిపిస్తున్నాయి. ముడి చమరు ధరలు పెరిగినా మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ లాభాల స్వీకరణ కారణంగా ఆ లాభాల్లో సగం వరకూ పొగొట్టుకొని చివరకు 269 పాయింట్ల లాభంతో 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 144 పాయింట్లు ఎగసిన చివరకు నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 11,427 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల గరిష్ట స్థాయిలకు చేరాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్ సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్1,353 పాయింట్లు (3.68 శాతం), నిఫ్టీ 392 పాయింట్లు (3.54 శాతం) చొప్పున పెరిగాయి.
14,000 కోట్ల విదేశీ పెట్టుబడులు...
పాక్, భారత్ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గడం, మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ. 14,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం స్టాక్ మార్కెట్ వరుసగా ఐదు రోజులు లాభపడటం గత పదిహేనేళ్లలో ఇదే మొదటిసారి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుతో రూపాయి బలపడుతోంది. వరుసగా ఐదో రోజూ లాభపడ్డ రూపాయి ఏడు నెలల గరిష్టానికి చేరింది.బ్రెగ్జిట్ గడువు పొడిగింపు, చైనా–అమెరికాల మధ్య ఒప్పందానికి కూడా గడువును పొడిగించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి.
ఆల్టైమ్ హైకి టైటాన్...
బ్యాంక్ షేర్ల లాభాలు కొనసాగుతున్నాయి. గత నెలలో రిటైల్, టోకు ద్రవ్యోల్బణాలు పెరిగినప్పటికీ, ఆర్బీఐ నిర్దేశిత స్థాయిల్లోనే ఉండటంతో రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు బలం పుంజుకున్నాయి. దీంతో బ్యాంక్ షేర్లు పెరుగుతున్నాయి. ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ బ్యాంక్ నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకింది. పలు షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, యూపీఎల్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, అర్వింద్ ఫ్యాషన్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద
Published Sat, Mar 16 2019 1:30 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement