సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీ నేతలు భారీ కేక్ కట్ చేసి వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తర్వాత పార్టీ తెలంగాణ విభాగం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ నిండునూరేళ్లు వర్దిల్లాలని నేతలు కాంక్షించారు.