ఒంగోలు అర్బన్ : ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గిరిజనుల హక్కులు కాలరాస్తోందని గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శంకర్నాయక్ విమర్శించారు. ఈ మేరకు ఆయన స్థానిక మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాలులో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఆరుగురు గిరిజనులు ఎమ్మెల్యేలుగా ఎన్నికకాగా టీడీపీలో ఒకే ఒక్కరు ఎన్నిక కావడం.. ఆయనకూ మంత్రి పదవి కేటాయించకపోవడం చంద్రబాబు నిరంకుశత్వానికి నిదర్శనమని శంకర్నాయక్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి టీడీపీ తరఫున గెలుపొందిన పోలవరం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 6శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కోరారు.
ఎర్రగొండపాలెం సమీపంలో గిరిజన విద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర జనాభాలో కేవలం 1శాతం ఉన్న వైశ్యులకు మంత్రి పదవి ఇచ్చి 5శాతం ఉన్న గిరిజనులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టికెట్ల కేటాయింపులో గిరిజనులకు వైఎస్సార్ సీపీ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. గిరిజనులను చిన్న చూపు చూస్తే సహించేది లేదని శంకర్నాయక్ గట్టిగా హెచ్చరించారు. సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సునీల్కుమార్ నాయక్, రామకృష్ణ, శివప్రసాద్, రామకృష్ణ నాయక్, వెంకట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన హక్కులు కాలరాస్తున్న టీడీపీ
Published Mon, Jun 23 2014 1:57 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బుల్లితెరపై శ్రీమద్ రామాయణం.. మిస్ట్ కాల్తో బహుమతి గెలవండి!
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు.. రింకూ ఆసక్తికర వ్యాఖ్యలు
రజనీకాంత్ మనవడి బర్త్డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్తో.. (ఫోటోలు)
కవితపై ఈడీ ఛార్జ్షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కేన్స్ రెడ్ కార్పెట్పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
తప్పక చదవండి
- కవితపై ఈడీ ఛార్జ్షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
Advertisement