సాక్షి, అమరావతి: జేసీ సోదరులు డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే తమపై కక్ష గట్టి గొడవలు సృష్టించారని ప్రభోదానందస్వామి భక్తులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి ఆశ్రమం నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ప్రబోధానందస్వామి ఆశ్రమం వద్ద కొద్దిరోజుల క్రితంజేసీ, ఆయన వర్గీయులు, ఆశ్రమంలోని భక్తుల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది ప్రబోధానందస్వామి భక్తులు సీఎంను కలిసేందుకు ఉండవల్లి వచ్చారు. వారిలో నలుగురిని మాత్రమే భద్రతా సిబ్బంది చంద్రబాబు వద్దకు పంపడంతో వారు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయని ఎలాంటి అవకతవకలు జరగట్లేదని తెలిపారు.
జేసీ సోదరులు డబ్బు కోసం తమను వేధించారని, డబ్బులివ్వకపోవడంతో కక్ష పెట్టుకుని తరచూ గొడవలు సృష్టిస్తున్నారని వివరించారు. అధికారులు, పోలీసులు జేసీ సోదరుల మాటలే వింటున్నారని తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమం మొత్తం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉందని, వందలాది మంది భక్తులను గృహనిర్బంధం చేశారని, బయట నుంచి తమను లోపలికి వెళ్లనీయట్లేదని వాపోయారు. జరిగిన ఘర్షణలకు సంబంధించి తమపై 30కి పైగా కేసులు పెట్టారని, 85 మందిని అరెస్టు చేశారని, కానీ తాము జేసీ వర్గీయులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు తీసుకోలేదని, రిజిష్టర్ పోస్టులో సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు పంపినా స్పందన లేదని చెప్పారు. ఆశ్రమం వద్ద శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, ఆశ్రమాన్ని యథావిధిగా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్య రాకుండా ఉంటే సమస్యను పరిష్కరిస్తానని, అందుకు సహకరించాలని చెప్పి వారిని పంపించివేశారు.
ఆశ్రమాన్ని నాశనం చేయాలని చూశారు
ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ప్రబోధానంద భక్తుల బృందానికి నేతృత్వం వహించిన గడియం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జేసీ సోదరులు కేవలం డబ్బు కోసమే తమ ఆశ్రమాన్ని నాశనం చేయాలని చూశారని తెలిపారు. గత కొన్నేళ్లుగా వారు ఆశ్రమంలోని భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోర్టుకు వెళ్లగా జేసీ సోదరులను న్యాయస్థానం మందలించిందని, అయినా వారిలో మార్పు రాలేదన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులను దారిమళ్లించి మందిరం వైపునకు తీసుకొచి మహిళలపై కుంకుమ చల్లుతూ అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అక్కడున్న భక్తులు వారిని ప్రశ్నించారని అది గొడవగా మారిందని అప్పటి పరిస్థితులను వివరించారు. జేసీ సోదరుల చర్యల వల్లే భయానక పరిస్థితులు నెలకొన్నాయని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
డబ్బులివ్వలేదనే జేసీ కక్ష గట్టారు
Published Tue, Oct 9 2018 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement