సాక్షి, హైదరాబాద్: అధికార టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారానికి బయల్దేరడానికి ముందు నెల్లూరు, మంత్రాలయం (కర్నూలు)కు చెందిన నాయకులను పార్టీలోకి చేర్చుకున్నారు. మంత్రాలయం నుంచి చేరిన వారిలో పలువురు వాల్మీకీ నేతలున్నారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు బాలకృష్ణారెడ్డి వీరిద్దరూ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో జగన్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
చంద్రబాబు వాల్మీకులను మోసం చేశారు
మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు వాల్మీకీ నేతలు పార్టీలో చేరారు. వాల్మీకి వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ రామిరెడ్డి, మాధవరం సర్పంచ్ రాఘవేంద్రరెడ్డి, ఆయన సోదరుడు రఘునాథరెడ్డి, పెద్దకడుగూరు సర్పంచ్ రవిచంద్రారెడ్డితో పాటు పలువురు వైఎస్ జగన్ను ఆయన నివాసంలో కలుసుకోగా వారికి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు తమ వాల్మీకులకు రాజకీయంగా అన్యాయం చేశారని విమర్శించారు.
వాల్మీకి వర్గానికి టికెట్ ఇస్తానని 2009, 2014 ఎన్నికల్లో చెప్పి ఇవ్వలేదని, చివరకు 2019లో కూడా మొండి చేయి చూపించారన్నారు. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వాల్మీకీలను రాజకీయంగా ఎదగనీయకుండా అణగదొక్కుతున్నారని రామిరెడ్డి అన్నారు. జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. వీరితో పాటు ఆర్.నవీన్కుమార్, ఆర్.శివరామిరెడ్డి, ఎన్.రాఘవేంద్రరెడ్డి, ఎన్.రామకృష్ణారెడ్డి , చిదానంద, ఎన్.రాజశేఖరరెడ్డి కూడా పార్టీలో చేరారు.
వైఎస్సార్సీపీలోకి నెల్లూరు డీసీసీబీ చైర్మన్
Published Sun, Mar 24 2019 5:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement