శ్రీశైలం వద్ద భారీగా ట్రాఫిక్ జాం | Sakshi
Sakshi News home page

శ్రీశైలం వద్ద భారీగా ట్రాఫిక్ జాం

Published Fri, Jan 29 2016 9:32 AM

heavy traffic jam at srisailam

శ్రీశైలం: ఘాట్ రోడ్డుపై ప్రయాణానికి ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచిందని ఆరోపిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీశైలంలో రాస్తారోకో చేపట్టారు. శ్రీశైలం నుంచి డోర్నాలకు ఇటీవల ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. అదేవిధంగా సున్నిపెంట నుంచి శ్రీశైలంకు రూ.10 నుంచి రూ.17కు పెంచింది.

ఈ పెంపుపై గత కొన్ని రోజులుగా సాధారణ ప్రజానీకం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం వామపక్షాల మద్దతుతో శ్రీశైలం ముఖద్వారం వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో శ్రీశైలం నుంచి వచ్చే బస్సులతోపాటు హైదరాబాద్, డోర్నాలతోపాటు ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చే సర్వీసులు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి

Advertisement

తప్పక చదవండి

Advertisement