♦ ఐదేళ్లుగా తల్లిని పట్టించుకోని తనయులు
♦ వృద్ధాశ్రమాల్లో కాలం వెల్లదీసిన మాతృమూర్తి
♦ అమ్మ ఆఖరి చూపునకూ రాని కొడుకులు
♦ పరమాత్మ ఆధ్వర్యంలో అంత్యక్రియలు
నవమాసాలు మోసి .. రక్తం పంచి జన్మనిచ్చిన తల్లిని వృద్ధాప్యంలో కాలదన్నారు.. ఆమె వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతోందనే విషయం తెలిసినా పట్టించుకోలేదు. చివరకు ఆమె కన్నుమూసినా కన్నతల్లిని కడసారైనా చూద్దామనుకోలేదు. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ పుత్రుల తీరును చూసిన వారు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అన్న ప్రజాకవి యోగి వేమన మాటల్ని గుర్తు చేసుకున్నారు.
కడప అర్బన్ : ఆమె పేరు పోలు సుబ్బమ్మ(85). కడప నగరానికి చెందిన ఈమెకు ఐదుగురు సంతానం. ఒక కొడుకు చనిపోగా ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వీరిలోఒకరిపేరు జగదీశ్వరరెడ్డి. ఇతను కడపలో న్యాయవాదిగా ఉన్నారు. మరో కొడుకు పేరు పోలు రామసుబ్బారెడ్డి. తెలుగుగంగలో సూపరింటెండెంట్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మరో కుమారుడు బలరామిరెడ్డి. ఇతను ఆర్టీసీలో మెకానిక్గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
ఆమె కుమార్తె పేరు ఉమాదేవి. ఇంతమంది ఉండికూడా ఆమెను పట్టించుకోలేదు. ఐదేళ్లుగా ఆమె వృద్ధాశ్రమాల్లోనే కాలం వెల్లదీస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం ఆమె కడప నగ రంలోని చిన్నచౌకు వార్డు కార్యాలయం సమీపంలో దీనస్థితిలో పడిపోయి ఉండగా మానవహక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గుడ్హార్ట్ ఫౌండేషన్ నిర్వాహకులు ఆమెను చేరదీశారు. ఈ విషయాలన్నీ ఆమె బిడ్డలకు తెలిసినా వారు స్పందించలేదు.
ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడిన సుబ్బమ్మ ఈనెల 25న తుదిశ్వాస విడిచింది. ఆశ్రమ నిర్వాహకులు ఆమె మృతి చెందిన విషయాన్ని ఆమె కొడుకులకు తెలిపారు. అంత్యక్రియలకైనా కొడుకులొస్తారేమోనని ఎదురు చూశారు. అయినప్పటికీ వారిలో చలనంలేదు. దీంతో పరమాత్మ సేవాసంస్థ ఛైర్మన్, ఏఎస్ఐ మలిశెట్టి వెంకటరమణ తమ సంస్థ సభ్యులతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో వచ్చిన ఆమె కుమారుడు బలరామిరెడ్డి తల్లి మృతదేహాన్ని కొంతదూరమైనా మోస్తారేమోనని భావించిన వారికి చేదు అనుభవమే ఎదురైంది.
నాకంటే పెద్దోళ్లు ఉన్నారు.. వాళ్లకు పట్టంది.. నేనెలా భుజం పడతానంటూ ఆయన తిరస్కరించడం గమనార్హం. పరమాత్మ వెంకటరమణ, గుడ్హార్ట్ ఫౌండేషన్ నిర్వాహకులు హరినాథ్ ప్రసాద్లు పోలు సుబ్బమ్మ మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోపరమాత్మ సేవాసంస్థ సభ్యులు రామరాజు, వంకదారి రాము, బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అయ్యవారయ్య, శివరాం, కార్తీకేయ, సెల్వం పాల్గొన్నారు.
దయలేని పుత్రులు
Published Wed, May 27 2015 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement