తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూత
సాక్షి, గుంటూరు: క్రేన్ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు (87) తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. క్రేన్ సంస్థలను స్థాపించి వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి కల్పించారు. శుక్రవారం ఉదయం ఆయన పార్థివదేహాన్ని గుంటూరు సంపత్నగర్లోని క్రేన్సంస్థలో సందర్శనార్థం ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంతాపాన్ని ఆయన కుమారుడు గ్రంథి కాంతారావుకు తెలియజేశారు.
రూ.150లతో మొదలైన ప్రస్థానం
1958లో అప్పటి గుంటూరులో రూ.150 పెట్టుబడి తో క్రేన్ వ్యాపారాన్ని గ్రంథి సుబ్బారావు మొదలు పెట్టారు. అది కూడా సైకిల్కు రెండు వక్కపొడుల సంచులు తగిలించుకుని ఊరంతా తిరిగి విక్రయించే వారు. అలా మొదలైన క్రేన్ ప్రస్థానం అంచెలం చెలుగా ఎదిగి అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం 300 మంది కార్మికులు వందల సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్లు క్రేన్పై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ఆవుపాలను, ప్రస్తుతం పెరుగును మార్కెట్లోకి విడుదల చేశారు. ‘స్వీయ సాధనలో’ అనే పేరుతో తన వ్యాపార విజయ ప్రస్థానాన్ని, ఔత్సాహిక వ్యాపారులకు ఇచ్చే సలహాలు, సూచనలతో పుస్తకం రచించారు.
టీటీడీ ధార్మిక మండలి సభ్యులుగా...
తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహా మండలి సభ్యులుగా గ్రంథి సుబ్బారావు ఉన్నారు. గుంటూరు సంపత్నగర్లో అయ్యప్పస్వామి దేవ స్థానం నిర్మించి ప్రతిఏటా రోజుకు 4వేల మందికి చొప్పున 40 రోజులపాటు అయ్యప్పలకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే అంకిరెడ్డిపాలెం సమీపంలో భారీ వినాయకుడి మందిరం నిర్మించారు.
‘క్రేన్’ అధినేత గ్రంథి సుబ్బారావు కన్నుమూత
Published Sat, Mar 25 2017 4:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement