దయచేసి.. కేసు వెనక్కి తీసుకోండి చంద్రబాబు | Sakshi
Sakshi News home page

దయచేసి.. కేసు వెనక్కి తీసుకోండి చంద్రబాబు

Published Tue, Jul 14 2020 8:14 PM

సాక్షి, విజయవాడ: పేదలకు సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి అడుగడుగునా అడ్డు తగులుతున్న తెలుగుదేశం పార్టీపై జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారి సొంతింటి కల, ఇళ్ళ పట్టాల పంపిణీకి అడ్డుపడవద్దంటూ ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు లేఖలు రాశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి అడ్రస్‌తో లేఖలు పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురం పోస్ట్‌ ఆఫీసు వద్ద మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement