ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే కుట్ర | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే కుట్ర

Published Tue, Feb 5 2019 7:02 AM

ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, పక్షపాతంగా వ్యవహరించే పోలీసు అధికారులను నియమించి ప్రతిపక్షాన్ని బెదిరించడం లాంటి దుశ్చర్యలకు అధికార పార్టీ పాల్పడుతోందని ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తెచ్చారు. పార్టీ ఎంపీలు, సీనియర్‌ నేతలతో కలసి సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాకు ఆయన ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement