హత్య కేసులో నిందితులకు రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితులకు రిమాండ్‌

Published Sat, May 25 2024 2:40 PM

-

భువనగిరి క్రైమ్‌ : మండలంలోని పచ్చర్లబోడ్‌ తండాలో లింగును హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు ఏసీపీ రవికిరణ్‌రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం.. పచ్చర్లబోడ్‌ తండాకు చెందిన లింగుకి, దేవిసింగ్‌కు మధ్య పాత కక్షలు ఉన్నాయి. కాగా గతంలో లింగుపై హత్య, దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో లింగు తనను చంపుతాడనే అనుమానంతో జనవరి 11న లింగుని దేవిసింగ్‌ తన కోళ్లఫారంలోకి పిలిచి మద్యం తాపించి మైకంలో ఉన్న లింగు మెడపై కత్తితో నరికాడు. లింగు తిరగబడితే దాడిచేయడానికి పొనుగోతు నరేష్‌ను గడ్డివాము చాటుకు కాపలాగా ఉంచాడు. దేవిసింగ్‌ రెండుసార్లు కత్తితో నరకడంతో లింగు చనిపోయాడు. అనంతరం శవాన్ని ప్లాస్టిక్‌ నల్ల పట్టాలో చుట్టి తాడుతో బిగించారు. రక్తం కనిపించకుండా చెరిపేశారు. దేవిసింగ్‌, నరేష్‌ ఇద్దరు కలిసి హీరో యాక్టివా వాహనంపై లింగు శవాన్ని వేసుకుని కిలో మీటర్‌ దూరంలో ఉన్న మూసీ కాలువలో వేశారు. లింగు సెల్‌ఫోన్‌ తీసుకుని ఉప్పల్‌ వద్ద చెరువులో పడవేశారు. అనంతరం తండాకు చేరుకున్నారు. పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా నిందితులు హత్య చేశామని ఒప్పుకున్నారు. శవాన్ని పడేసిన ప్రదేశాన్ని చూపించారు. కాగా శవం పూర్తిగా కుళ్లిపోయి ఉన్నది. పంచనామ నిర్వహించిన అనంతరం గ్రామంలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ చేసినట్లు ఏసీపీ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement