Sakshi News home page

గురుకులాల్లో మిగులు సీట్లకు కౌన్సెలింగ్‌

Published Tue, Apr 16 2024 3:35 AM

-

విజయనగరం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని పాఠశాలల్లో 5వ తరగతి మిగులు సీట్లకు కౌన్సెలింగ్‌ తేదీలను ఆ సంస్థ ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయకర్త టి.పద్మజ ప్రకటించారు. 2024–25 విద్యాసంవత్సర ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో మెరిట్‌ సాధించిన వారికి కౌన్సెలింగ్‌ చేపడతామన్నారు. కొప్పెర్ల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలుర పాఠశాలలో ఈ నెల 18న , చీపురుపల్లి డాక్టర్‌ బీఆర్‌అంబేద్కర్‌ గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 19న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాతిపదికన నిర్వహించే కౌన్సెలింగ్‌కు మెరిట్‌ జాబితాలో ఉన్న విద్యార్ధుల మొబైల్‌ ఫోన్‌కు సమాచారం అందజేశామన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభించే కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు ఉదయం 9 గంటలకే హాజరుకావాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం బాలికలు 83330 33434, బాలురు 63038 38657 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

18న బాలురు, 19న బాలికల

గురుకులాలకు

Advertisement
Advertisement