ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న అప్పారావు - Sakshi

శృంగవరపుకోట: మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన గిడుతూరి అప్పారావు(46) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌.కోట ఎస్సై లోవరాజు మంగళవారం చెప్పారు. అప్పారావు తాగుడుకు బానిస కావడం, స్థిరత్వం లేక పోవడంతో ఆయన భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన అప్పారావు ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఈ విషయం గమనించిన తల్లి లక్ష్మి ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించిన సమయంలో తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఏఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేశారని ఎస్సై వివరించారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top