![నేటి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/25052024-vkb_tab-01_subgroupimage_1333022864_mr.jpg.webp?itok=IHY1bdPH)
అనంతగిరి: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ అనంతగిరిపల్లి ప్రిన్సిపాల్ జేజే ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్
అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. విడిగా, గుర్తింపు పొందని పత్తి విత్తనాలు విక్రయించరాదని సూచించారు. విత్తన సంచి మీద జీఈఏసీ సంఖ్య తప్పని సరిగా ఉండాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవన్నారు. స్టాకు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.
ప్రశాంతంగా పాలిసెట్
అనంతగిరి: పాలిసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని జిల్లా కోర్డినేటర్ పరవేశ్వర్ తెలిపారు. వికారాబాద్లోని మూడు సెంటర్లలో 1,325 మంది విద్యార్థులకు గాను 1,145మంది హాజరైనట్లు తెలిపారు.
మత్స్యకార్మికుల
సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: చేప, రొయ్య పిల్లల పంపిణీని టెండర్ల విధానం ద్వారా కాకుండా.. ఈ సంవత్సరం మత్స్య సొసైటీ బ్యాంకు ఖాతాలో నగదు జమచేయాలని మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ ప్రభుత్వాన్ని కోరారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన టీఎంకేఎంకేఎస్ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు గడిచినా మత్స్యశాఖకు మంత్రిని నియమించలేదని విమర్శించారు. జూన్ నెల సమీపిస్తున్నా మత్స్యకారులకు ఇచ్చే చేపపిల్లల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మృగశిర కార్తెను చేపల పండువగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని, ఎఫ్టీఎల్ హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కొండల్, రాములు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.
జీవాల సంరక్షణకు
జాగ్రత్తలు అవసరం
రంగారెడ్డి జిల్లా పశువైద్యాధికారి విజయ్కుమార్రెడ్డి
మొయినాబాద్: జీవాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి విజయ్కుమార్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సురంగల్లో శుక్రవారం పశువైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గొర్రెలకు చిటుక రోగం నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం కురిసే వర్షాలకు భూమిపై మొలకెత్తే గడ్డిని తినడం ద్వారా గొర్రెలకు చిటుకరోగం వచ్చే అవకాశం ఉందన్నారు. చిటుకరోగం వస్తే గొర్రెలు వెంటనే మృతి చెందుతాయన్నారు. ఈ రోగం రాకుండా గొర్రెల కాపర్లు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా చిటుక వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా వేస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శ్రీలత, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
![నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు](/sites/default/files/gallery_images/2024/05/25/24ibr03-640023_mr.jpg)
నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
![నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు](/sites/default/files/gallery_images/2024/05/25/24vkb95-360018_mr.jpg)
నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు