తాండూరు: విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుధారాణి అన్నారు. శుక్రవారం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు నాణ్యమైన విత్తనాలు గుర్తించే పద్ధతిని రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం పంట సాగు విషయంలో శాస్త్రవేత్తలు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. జన్యుపరమైన భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనాలు వాడితే పది నుంచి 15 శాతం వరకు అధిక దిగుబడుగులు సాధింవచ్చునన్నారు. విత్తన శుద్ధితో పంట లాభం ఉంటుందన్నారు. కందిలో అతరపంటగా పెసర, మినుము, సోయా, కొర్రలు సాగు చేసుకుంటే అధిక లాభాలు ఆర్జించవచ్చునని వివరించారు. నల్లరేగడి భూముల్లో కంది జంటసాళ్ల పద్ధతిలో సాగు చేయాలని సూచించారు. నీటి ముంపున్న భూముల్లో బోదెలు, కాల్వల పద్దతిలో పంటలకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పారు. పరిశోధన స్థానం రూపొందించిన కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణ కంది–3(టీడీఆర్జీ–59), ఆశ (ఐసీపీఎల్ 87119) రకాల విత్తనాలు రైతులకు అందజేశామన్నారు. శాస్త్రవేత్తలు డాక్టర్.సుధాకర్చౌరట్, యము న, శేఖర్, రాజేశ్వర్రెడ్డి రైతులు తదితరులున్నారు.
తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి