షాద్నగర్: రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ బాధ్యతలకు రాజావరప్రసాద్ రాజీనామా చేశారు. బుధవారం ఆయన రాజీనామా పత్రాన్ని సహకార సంఘం మేనేజింగ్ డైరక్టర్ అరుణ గోపరాజు ద్వారా సహకార శాఖ కార్యదర్శి రఘునందన్రావుకు పేషికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓటమి చెందడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సహకార సంఘం బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తాను రూపొందించిన ప్రత్యేక నివేదికను ప్రభుత్వానికి పంపించానని తెలిపారు, చైర్మన్గా పని చేసే అవకాశాన్ని కల్పించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కూనంనేనికి
ఘన సన్మానం
షాద్నగర్రూరల్: కొత్తగూడెం శాసనసభ్యుడిగా ఎన్నికై న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును ఆ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. నగరంలోని హిమాయత్నగర్లో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో షాద్నగర్ సీపీఐ నాయకులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ పానుగంటి పర్వతాలు, కోకన్వీనర్లు బుద్దుల జంగయ్య, శ్రీను, జిల్లేడు చౌదరిగూడ మండల కార్యదర్శి వెంకటేశ్, నందిగామ మండల కార్యదర్శి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.