సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 97,424కు చేరింది. ఈ మేరకు గురువారం ఉదయం వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా కరోనా వైరస్తో కొత్తగా 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 729కు పెరిగింది. కాగా బుధవారం కొత్తగా 1195 మంది కోలుకోని ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 75,186కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 8,21,311మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. తెలంగాణలో రికవరీ రేటు 77.17శాతం ఉందని బులెటిన్లో వెల్లడించింది.