సాక్షి, చైన్నె: లోక్సభ ఎన్నికల పనులకు పార్టీ వర్గాలు సిద్ధం కావాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి పిలుపు నిచ్చారు. బూత్ కమిటీల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజల్లోకి మమేకమయ్యే విధంగా కార్యక్రమాలు విస్తృతం చేయాలని సూచించారు. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం మంగళవారం సాయంత్రం రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్మాళిగైలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పళణి స్వామికి పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. దివంగత నేతల ఎంజీఆర్, జయలలిత విగ్రహాలకు, చిత్ర పటాలకు నివాళులర్పించినానంతరం సమావేశానికి పళణి స్వామి వెళ్లారు. సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల కార్యదర్శులు, కొత్తగా నియమితులైన వారు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ముందుగా జిల్లాల వారీగా పార్టీ తరపున చేపట్టాల్సిన కా ర్యక్రమాలు, బూత్ కమిటీల ఏర్పాటు గురించి చర్చించారు. బూత్ కమిటీల ఏర్పాటు మరింత వేగవంతానికి చర్యలు తీసుకోవాలని జిల్లాల కార్యదర్శులను పళణి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతం కావాలని, బీజేపీతో అన్నాడీఎంకేకు ఎలాంటి బంధం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. మైనారిటీలకు మద్దతుగా ఆది నుంచి అన్నాడీఎంకే చేస్తూ వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వివరిస్తూ వారి మద్దతను కూడగట్టుకునే ప్రయత్నాలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలలోని ముఖ్య నగరాలు, పట్టణాలలో డీఎంకే ప్రజా వ్యతిరేక విధానాలు, మాయాజాలం ప్రజలకు వివరించే విధంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బీజేపీ తో తెగ తెంపుల నేపథ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనేందు విధంగా ధైర్యంగా ముందుకెళ్దామని పార్టీ వర్గాలకు పళని పిలుపు నిచ్చినట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇందులో కూటమి గురించి కొందరు, కేసుల నేపథ్యంలో కేంద్రం రూపంలో తమకు ఎదురయ్యే ఇబ్బందులను మరి కొందరు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్, కోశాధికారి దిండుగల్ శ్రీనివాసన్, సీనియర్ నేతలు మునుస్వామి, ఎస్పీ వేలుమణి పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికలకు సిద్ధంకండి
Published Wed, Nov 22 2023 12:38 AM
1/1
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
క్రేజ్ కా బాప్ వైఎస్ జగన్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్
ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత
కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
తప్పక చదవండి
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement