ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Published Sat, May 25 2024 3:00 PM

-

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రా ల్లో తొలిరోజు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. తొలి రో జు ఫస్టియర్‌ విద్యార్థులు 3422 మందికి గాను 176 మంది గైర్హాజరయ్యారు. సెకెండియర్‌ విద్యార్థులు 926 మందికి గాను 80 మంది గైర్హాజరయ్యా రు. డీవీఈవో కోట ప్రకాశరావు, ఆర్‌ఐవో ప్రగడ దుర్గారావు, డీఈసీ కమిటీ సభ్యులు బొమ్మలాట శ్యామ్‌సుందర్‌, గూణ సింహాచలం, కీర్తి తవిటినాయుడు పర్యవేక్షించారు. మూడు ఫ్లయింగ్‌, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement