![డీఈఓ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24pty104-110025_mr.jpg.webp?itok=KDbTQ1Cz)
పుట్టపర్తి అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 25న సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న డీఈఓ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు డీఆర్ఓ కొండయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన అర్బన్ డీఎస్పీ వాసుదేవన్తో కలిసి కలెక్టరేట్లోని కోర్టు హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన 110 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. శనివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ పరీక్ష జరుగుతుందని, కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విష్ణు, ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు.