ఇంటర్‌ పరీక్షలకు 421 మంది గైర్హాజరు | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు 421 మంది గైర్హాజరు

Published Sun, May 26 2024 3:45 AM

-

నెల్లూరు (టౌన్‌): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం రెండో రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌కు జనరల్‌ విద్యార్థులు 9,635 మంది హాజరు కావాల్సి ఉండగా 9,214 మంది పరీక్షలు రాశారు. 421 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 271 మందికి గానూ 33 మంది పరీక్షకు హాజరు కాలేదు. మధ్యాహ్నం నుంచి ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షకు జనరల్‌ విద్యార్థులు 433 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 386 మంది హాజరయ్యారు. 47 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 113 మందికి గానూ 14 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ 6 కేంద్రా లను, డీవీఈఓ 3 కేంద్రాలను, స్క్వాడ్‌ బృందం 32 కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement