గాలివాన బీభత్సం | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Published Sat, May 25 2024 5:40 PM

గాలివ

రాజీవ్‌ రహదారిపై స్తంభించిన రాకపోకలు

కొండపాక(గజ్వేల్‌): బలమైన ఈదురు గాలులకు వర్షంతోడైంది. రాజీవ్‌ రహదారిపై చెట్లు, రేకులు ఎగిరిపడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన దుద్దెడ శివారులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. భారీగా వీచిన ఈదురు గాలులకు రాజీవ్‌ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజా సమీపంలో షెడ్ల రేకులు, కొట్టుకు వచ్చి రహదారికి అడ్డంగా పడ్డాయి. దీంతో సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. చెట్లు నెలకూలాయి. పోలీసులు. టోల్‌ ప్లాజా సిబ్బంది రహదారిపై పడిన రేకులను, చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. దీంతో పాటు కొండపాక, దమ్మక్కపల్లి, దుద్దెడ, సిర్సనగండ్ల, తిమ్మారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలులకు చెట్లు కూలాయి.

గాలివాన బీభత్సం
1/1

గాలివాన బీభత్సం

Advertisement
 
Advertisement
 
Advertisement