సిద్దిపేటజోన్: నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే హరీశ్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, వైస్ చైర్మన్ కనకరాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక 31, 32, 33, 34 వార్డుల్లో మంత్రి హరీశ్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన ప్రగతి పుస్తకాలను ఇంటింటికీ పంపిణీ చేసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. సిద్దిపేట గౌరవాన్ని ఇనుమడింప చేసిన మంత్రికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి వేణు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మోహిజ్, వజీర్, తిరుమాల్, సుందర్, బుచ్చిరెడ్డి, విఠోభ, మల్లికార్జున్, శ్రీలత, శ్రీహరి, శ్రీనివాస్ యాదవ్,సాయి ఈశ్వర్,రఘురాం, ఎల్లం, అరవింద్, బ్రహ్మం, ఆనంద్, రాజు, నాయకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పథకాలను వివరిస్తున్న రాజనర్స్ తదితరులు