హుస్నాబాద్రూరల్: పల్లెల అభివృద్ధికి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ఉపయోగపడతాయని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధిశాఖ పరిపాలన అధికారి స్వామిగౌడ్ అన్నారు. శుక్రవారం మహ్మదాపూర్, నాగారం, పోతారం(ఎస్) గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను చూసి సంరక్షకులను అభినందించారు. తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేసే పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువులను వినియోగించుకొనే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పనులను వ్యవసాయ రంగానికి ఉపయోగిస్తే రైతులకు ఉపయోగపడటమే కాకుండా కూలీలకు పనులు దొరుకుతాయని చెప్పారు. గ్రామాల అంతర్గత రోడ్ల నిర్మాణం, పేదల భూమి సదను చేయడం, చెరువు మట్టి తరలించడం లాంటి పనులు చేసుకోవచ్చని చెప్పారు. వీరి వెంట ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, టీఏ పరశురాం తదితరులు ఉన్నారు.
నిధులను సద్వినియోగం చేసుకోండి
రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి స్వామి గౌడ్