జోగిపేట(అందోల్): చారిత్రాత్మకమైన అందోలులోని శ్రీ రంగనాథ ఆలయానికి చెందిన పంచలోహాలకు చెందిన ఉత్సవ విగ్రహాలు ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత శుక్రవారం ఆలయానికి చేరుకున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోలులోని రంగనాథ దేవాలయానికి చెందిన శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యబామ, నాలుగు ఆల్వార్ల విగ్రహాలు, తదితర పూజా సామగ్రిని 1992వ సంవత్సరంలో అప్పటి పూజారులు ఈ విగ్రహాలకు ప్రతి రోజూ పూజా కార్యక్రమాలు, రక్షణ విషయంలో ఇబ్బందులుగా ఉన్నాయని తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద మనుషుల సమక్షంలో నాచారంలోని శ్రీ లక్ష్మినర్సింహస్వామి దేవాలయ అధికారులకు అప్పగించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ విషయాన్ని తెలుసుకొని విగ్రహాలను యథావిధిగా అందోలు దేవాలయానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆలయంలో ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఉత్సవ విగహ్రలకు పూజలు నిర్వహించాలన్నదే మంత్రి ఉద్దేశ్యమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.